కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 8వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శెట్టివీడు గ్రామానికి చేరుకున్నారు. 8వ రోజు చాగలమర్రి శివారు నుంచి జననేత తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు తమ బాధలు చెప్పుకున్నారు. ఇక్కడి నుంచి గొడిగనూరు గ్రామానికి వెళ్తారు. గ్రామంలో జెండా ఆవిష్కరించనున్నారు.
No comments:
Post a Comment