వీరనాయిని పల్లె : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. వీరనాయిని పల్లెలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గంలో రెండు పంటలు పండించుకోవాలంటే సర్వరాయసాగర్ను సాధించుకోవాల్సిందే అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం. మన ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మన బతుకులు మారిపోతాయన్నారు. ఉక్కు ప్యాక్టరీ కోసం మన నియోజకవర్గంలో 6 వేల ఎకరాలు సేకరించారు. వైయస్ జగన్ సీఎం అయితే ఉక్కు పరిశ్రమ వస్తుందన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఇంట్లో ఉద్యోగస్తులు ఉంటే మన పరిస్థితి మారిపోతుందన్నారు. మనకు ఎవరు సహాయం చేయాల్సిన పని లేదు. మన కాళ్లపై మనం నిలబడాలంటే తప్పకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు పార్టీ చాలా బలంగా ఉంది. రాష్ట్రంలో∙ప్రతిపక్షంగా ఉంటూ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న పార్టీ మనదే అన్నారు. మన వైయస్ జగన్ దేశంలోనే అత్యుత్తమ ప్రజాధరణ గలిగిన వ్యక్తిగా ఐదో స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. మన అందరం తప్పనిసరిగా వైయస్ జగన్ను ఆశీర్వదిద్దామన్నారు. గతంలోనే మనందరం వైయస్ఆర్సీపీకి ఓట్లు వేశాం. కానీ చంద్రబాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వైయస్ జగన్ మాట ఇస్తే తప్పని వ్యక్తి . మన అందరం కూడా వైయస్ జగన్కు మద్దతుగా నిలబడుదాం. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరికి ఆత్మబంధువే. ఆయన కుమారుడు వైయస్ జగన్కు తోడుగా నిలుద్దాం. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment