వైయస్ఆర్ జిల్లా: జమ్ములమడుగు నియోజకవర్గంలోని పొట్లదుర్తి గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఐదో రోజు పాదయాత్రగా పొట్ల దుర్తి గ్రామానికి వచ్చిన వైయస్ జగన్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం కావడంతో జనాన్ని వైయస్ జగన్ యాత్రలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా జననేతకు బ్రహ్మరథం పట్టారు. సీఎం రమేష్ తమకు ఏమీ చేయలేదని, సంక్షేమ పథకాలు టీడీపీ నేతలకే దక్కుతున్నాయని వైయస్ జగన్దృష్టికి తీసుకెళ్లారు.
No comments:
Post a Comment