వైయస్ఆర్ జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుడగ జంగాల కులస్తులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న బుడగజంగాల కులస్తులను ఎస్సీలుగా గుర్తించాలని బుడగజంగాల సంఘం నాయకుడు, వైయస్ఆర్సీపీ యువజన కార్యదర్శి పస్తం అంజి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ ఆధ్వర్యంలో పాదయాత్రలో ఉన్న వైయస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ లో బుడగజంగాలను ఎస్సీలుగా గుర్తించి సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరారు. వైయస్ జగన్ను కలిసిన వారిలో కె. చిన్నరాముడు, సి. వెంకటరమణ, డి. రాముడు, లక్షుమయ్య ఉన్నారు.
No comments:
Post a Comment