వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైయస్జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వైయస్జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోంది. పాదయాత్రపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. పాదయాత్ర ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే వేలాది మంది, రోజు వ్యవధిలో లక్షలాది మందికి పైగా చూస్తున్నారు. ప్రతి వీడియో గంటకు సగటున 40 వేల మంది వీక్షకులు చూస్తున్నారు. గురువారం సాయంత్రానికే లక్షలాది మంది వీక్షించారు. పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో అని వైయస్ జగన్ ఇచ్చిన తొలి ౖ»ñ ట్కు అనూహ్య స్పందన వచ్చింది. ఫేస్బుక్లో వీడియో చూసిన 12 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. వైయస్ జగన్ను తల్లి వైయస్ విజయమ్మ ఆశీర్వదించిన వీడియోను 9 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ప్రజా సంకల్ప యాత్రను ప్రజలకు చేరువ చేసేందుకు వైయస్ఆర్సీపీ డిజిటల్ మీడియా ట్విట్టర్, ఫెస్బుక్, వాట్సప్లను వేదికగా చేసుకొని ప్రతిరోజు పాదయాత్ర వీడియోలు, ఫోటోలు, అప్డెట్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చే స్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర విశేషాలను నెటిజన్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైయస్ జగన్కు మద్దతు తెలుపుతున్నారు.
No comments:
Post a Comment