వైయస్ఆర్ జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కొద్ది సేపటి క్రితం ఇక్కుపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కుపల్లి జంక్షన్లో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ గ్రామానికి వచ్చిన జననేతను గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. వైయస్ జగన్పై పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు.
No comments:
Post a Comment