ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి మహా సంకల్పంతో ముందుకు ఉరుకుతున్నారు. నవంబర్ 6 నుంచి 6 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన 125 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మిగిలిన 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నడుం బిగించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో ముందుకు సాగనున్నారు. పార్టీకి జవసత్వాలు సమకూర్చడంతోపాటు రాబోవు ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే మహాసంకల్పంతో ఆయన ముందడుగు వేస్తున్నారు.
No comments:
Post a Comment